కొందరు జీవితంలో ఎంత కష్ట పడినా వారి కష్టాలు తీరవు సరికదా.మనుగడే కష్టమైపోతుంది.
అయినా అలాగే చాలీ చాలని డబ్బుతో తమ జీవితాన్ని గడిపేస్తూ వుంటారు.వారి అదృష్టం అంతవరకే అనుకుంటారు.
అందులో కొంతమంది మాత్రం కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకొని లాటరీలు వెంట పడుతూ ఉంటారు.అయితే, ఇవి ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఖచ్చితంగా చెప్పలేం.
ఒక్క లాటరీతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యేవారిని మనం చూస్తూ ఉంటాం.అలాగే కొందరు లాటరీలు మాయలో పడి వున్న కొద్ది పాటి ఆస్తిని కూడా అమ్ముకునే వారు లేకపోలేదు.
ఇక లాటరీ వేసే ప్రతి ఒక్కరూ తమకే అది దక్కాలని అనుకుంటూ ఉంటారు.కానీ ఏ లక్ష మందిలో ఒక్కరికో అది తగులుతుంది.మాములుగా ఒక లాటరీ తగలడమే విశేషం.కానీ వేసిన ప్రతి లాటరీ గెలుచుకోవడానికి పెట్టి పుట్టాలి.
అయితే గత నెలలో వెస్ట్ వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి 20 లాటరీ టికెట్లు కొనుగోలు చేసాడు.అందులో ఏదో ఒకటి తగలక పోతుందా అని ఎదురు చూశాడు.
అనూహ్యంగా అతగాడు కొన్న 20 లాటరీలన్నీ గెలుచుకున్నాడు.కాగా ఈ లాటరీల ద్వారా అతనికి 1,25,00 అమెరికన్ల డాలర్లు (దాదాపు రూ.90 లక్షలు) గెలుచుకున్నాడు.
సరిగ్గా.
ఇలాంటిదే మరో ఘటన.ఈ నెలలో వర్జీనియాలో సౌత్బోస్టన్ కి చెందిన టోనీమైల్స్ ను కూడా ఇదే రీతిలో లక్ష్మీదేవి అనుగ్రహించింది.కొన్న 20 లాటరీలు అతగాడు గెలుచుకొని, అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఇకపోతే అతగాడు గెలుచుకున్న ఒక్కో లాటరీకి 5,000 డాలర్లు… (అనగా మన రూపాయలలో దాదాపు రూ.3.66 లక్షలు) బహుమతి రాగా.మొత్తం లాటరీలకు కలిపి లక్ష డాలర్లు (ఇంచుమించు 73.24 లక్షలు) బహుమతి పొందాడు.ఒకేసారి ఇన్ని లాటరీలను గెలిచిన టోనీ.గెలుచుకున్న డబ్బుతో తనకున్న అప్పులన్నీ తీర్చేస్తానని, ఇంకా అందమైన ఇల్లు కట్టుకుంటానని చెబుతున్నాడు.