పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంతేకాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా పవన్ కు వీరాభిమానులు ఉన్నారు.
ఈయన సినిమాల కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇక ఈయన సినిమాలోని డైలాగ్ లను కూడా బాగా వాడుతుంటారు.
ఇదిలా ఉంటే తాజాగా సెహ్వాగ్ కూడా పవన్ డైలాగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి అందరికీ తెలిసిందే.
క్రికెటర్ అభిమానులకు ఈయన అభిమాన క్రికెటర్ గా నిలిచాడు.మంచి బ్యాట్స్ మెన్ గా గుర్తింపు పొందాడు వీరేంద్ర సెహ్వాగ్.
ఇంతటి స్టార్ క్రికెటర్ మరో స్టార్ హీరో డైలాగు చెప్పడంతో ఈ స్టార్ సెలబ్రిటీల అభిమానులు తెగ మురిసిపోతున్నారు.ఇంతకీ సెహ్వాగ్ చెప్పిన డైలాగ్ ఏ సినిమాలోనిదంటే .పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో పవన్ కెరీర్ కు మంచి హిట్ ను అందించింది.ఇక ఇందులో డైలాగ్స్, ఫైట్స్ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి.ఇందులో నాకు కొంచెం తిక్కుంది.
దానికో లెక్కుంది అని డైలాగ్ అనేది ఎంత హల్ చల్ చేసిందో చూశాం.ఇప్పటికీ ఈ డైలాగ్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు.
ఈమధ్య రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మరింత బిజీగా ఉంటున్నాడు సెహ్వాగ్.
ఫన్నీ వీడియోలను, కొన్ని విషయాలను బాగా పంచుకుంటున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ కూడా నాక్కొంచెం తిక్కుంది.దానికో లెక్కుంది అనే డైలాగ్ ను కొట్టగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోని చూసిన అభిమానులు తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు.