రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యింది.
ఈ సినిమా రిలీజ్ కు ముందే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి.డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని ముందు అనుకున్నా సాయి పల్లవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి ఫలితం దక్కించుకుంటుందని అనుకున్నారు.
కానీ సీన్ రివర్స్ అయ్యింది.ఇక ఓటీటీ లో ఈ సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది.
జూన్ 17న రిలీజైన ఈ సినిమా కేవలం 14 రోజుల్లోనే ఓటీటీ రిలీజ్ అవుతుంది.జూలై 1న విరాటపర్వం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది.సినిమా కోసం రానా, సాయి పల్లవి ఎంతో కష్టపడ్డారు.సినిమాను ప్రేక్షకులు ఓటీటీలో అయినా ఆదరిస్తారేమో చూడాలి.
ఈ సినిమాలో ప్రియమణి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.సో జూలై 1న గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుండగా అదే రోజు నెట్ ఫ్లిక్స్ లో రానా విరాటపర్వం ఓటీటీ రిలీజ్ అవుతుంది.