బాహుబలి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ భళ్లాలదేవ రానా దగ్గుబాటి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.సెలెక్టివ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రానా, ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా అప్పుడెప్పుడో అనౌన్స్ చేసినా పట్టాలు మాత్రం ఎక్కలేదు.దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందో లేదో అని అనుకున్నారు అందరూ.కాగా రానా అనారోగ్య కారణాల వల్ల ఆయన అందుబాటులో లేకుండా పోయాడు.ప్రస్తుతం విరాటపర్వం చిత్ర షూటింగ్ను కేరళలో జరుపుకుంటున్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమా పీరియాడికల్ హిస్టరీగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఫిదా పోరి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
సాయి పల్లవి పాత్ర ఈ సినిమాలో చాలా విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియమణి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.