యంగ్ హీరో రానా, సాయిపల్లవి కాంబినేషన్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఒక వర్గం ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న ఈ సినిమా వచ్చే నెల 30వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమా రానా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని రానా ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన విరాటపర్వం టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాటు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
అయితే నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నేటితరం యువత కనెక్ట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.పది, పదిహేను సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ప్రభావం ఉన్నా ఆ సమయంలో నక్సలిజం నేపథ్యం తెరకెక్కిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా నక్సలిజం నేపథ్యంలోనే తెరకెక్కుతున్నా కొరటాల శివ ఆ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
వేణు ఊడుగుల తొలి సినిమా నీది నాది ఒకే కథ సినిమా మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నా కమర్షియల్ గా హిట్ కాలేదనే సంగతి తెలిసిందే.మరి నక్సలిజం ప్రధానంగా తెరకెక్కుతున్న విరాటపర్వం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.మరోవైపు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని సాయిపల్లవి కెరీర్ కూడా భవిష్యత్తు సినిమాలపై ఆధారపడి ఉంది.
సీరియస్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించని నేపథ్యంలో విరాటపర్వం సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.అయితే నవ్యత ఉన్న కథలు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్న నేపథ్యంలో విరాటపర్వం కూడా సక్సెస్ అవుతుందేమో చూడాల్సి ఉంది.