విభిన్న పాత్రలను చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా దగ్గుబాటి.ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రెసెంట్ రానా చేసిన సినిమాల్లో విరాటపర్వం ఒకటి.
ఈ సినిమాలో ముద్దుగుమ్మ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ఎప్పుడో విడుదలకు సిద్దమైన కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.
ఇక కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ అవ్వక పోవడంతో ఈ సినిమా ఓటిటి కి వెళ్తుంది అని వార్తలు వచ్చాయి.కానీ ఆ వార్తల్లో ఎలాంటి స్పష్టత లేదు.అయితే ఈ సినిమా ఇంకా కొద్దిగా షూట్ బాలన్స్ ఉందని చిత్ర యూనిట్ కొద్దీ రోజుల క్రితం తెలిపింది.ఒక వారం రోజులు షూట్ చేస్తే పూర్తి అవుతుంది ఆ తర్వాతనే విడుదలపై స్పష్టత ఇస్తాం అని టీమ్ తెలిపింది.
అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూట్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.ఈ చివరి షెడ్యూల్ షూట్ ను మూడు నాలుగు రోజుల్లోనే పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేస్తే ఎక్కువ లాభం ఉంటుందని మేకర్స్ అనుకుంటున్నారట.ఎందుకంటే అటు రానాకు ఇటు సాయి పల్లవి కి ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంది.
అందుకే ఈ సినిమా థియేటర్స్ లో విడుదల చేసిన ప్రేక్షకులు వస్తారని నిర్మాత నమ్ముతున్నారట.అందుకే ఈ సినిమా విషయంలో ఇక నిర్ణయం మార్చుకోకూడదని అనుకుంటున్నారని సమాచారం.అంతేకాదు అటు థియేటర్స్ లో విడుదల అయినా తర్వాత ఫలితాన్ని బట్టి మళ్ళీ ఓటిటి సంస్థ దగ్గర ఒప్పందం కుదుర్చుకుంటే రెండు విధాలుగా ఈ సినిమాకు లాభం వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాల్సిందే.