రానా విరాట పర్వం సినిమా షురూ అయ్యి దాదాపుగా మూడు సంవత్సరాలు అయ్యింది.అనారోగ్య కారణాల వల్ల రానా సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది.
పెద్ద ఎత్తున బడ్జెట్ లేకుండా సింపుల్ గానే దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కించాడు.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రానా మరియు సాయి పల్లవిల పారితోషికంతో కలిపి రూ.20 కోట్ల లోపే అంటున్నారు.సినిమా లో సాయి పల్లవి ఉండటం వల్ల సినిమా రేంజ్ అమాంతం పెరిగి పోయింది.ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 11.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు 7.5 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది.
థియేట్రికల్ రైట్స్ మరియు ఇతర రైట్స్ రూపంలో ఈ సినిమా కు దాదాపుగా రూ.35 కోట్లకు పైగా నిర్మాతల ఖాతాలో పడే అవకాశం ఉందంటున్నారు.షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల కాస్త బడ్జెట్ పెరిగింది.లేదంటే మరింత గా ఈ సినిమాకు లాభాలు వచ్చి ఉండేవి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
రానా సినిమా అవ్వడంతో పాటు పాన్ ఇండియా గుర్తింపు ఉన్న సాయి పల్లవి ఈ సినిమా లో నటించడం వల్ల సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఫస్ట్ లుక్ తోనే తేలిపోయింది.
సాయి పల్లవి లుక్ మరియు సినిమా నేపథ్యం తెలిసి సినిమా కు ఈ మొత్తం ను పెట్టేందుకు బయ్యర్లు ముందుకు వస్తున్నారు.విడుదల సమయంకు లాభం మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్న విషయం తెల్సిందే.సినిమాను ఏప్రిల్ 30వ తారీకున విడుదల చేయబోతున్నారు.