బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ టీం నుంచి ఇన్ని రోజుల తర్వాత ఫ్యాన్స్ కోరుకునే అదిరిపోయే ఆటని కోహ్లి సేన ఆడి చూపించింది.సామర్ధ్యం ఉన్న ఆటగాళ్ళు ఉన్న కూడా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి సేన తాజాగా తన ఐదో మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ మీద వీర విహారం చేసింది.
ముఖ్యంగా కెప్టెన్ కోహ్లి తనదైన శైలిలో రెచ్చిపోవడంతో పాటు, డాషింగ్ బ్యాట్స్ మెన్ డీవిలియర్స్ మెరుపులు వెరసి ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది.
మొదటి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు ఓపెనర్లు పెట్టించారు.మొదటి వికెట్ కి 50 పరుగులు భాగస్వామ్యం తరువాత 64 పరుగుల వద్ద పార్ధివ్ పటేల్ అవుట్ అయ్యాడు.
అనంతరం క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ 31 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు.ఈ సీజన్ లో మొదటి హాఫ్ సెంచురీ నమోదు చేసాడు.
కోహ్లి 89 పరుగులుతో రాణించగా ఇక డివిలియర్స్ 32 బంతులలో 63 చేసాడు.చివర్లో వచ్చిన స్టోయినీస్ మెరపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్స్ లో ఆర్సీబి ఏకంగా 205 పరుగులు చేసింది.