ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ తో క్రికెట్ ఫీవర్ నడుస్తుంది.యూత్ ఈ ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఫుల్ క్రేజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఐపీఎల్ గత సీజన్స్ కంటే మరింత ఆసక్తిగా నడుస్తున్నాయి.తాజాగా నిన్న జరిగిన రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
అయితే ఈ మ్యాచ్ లో ఎంపైర్ తప్పిదం వలన విరాట్ సేన ఓడిపోయింది.చివరి బంతికి ముంబై బౌలర్ నోబాల వేసిన కూడా ఎంపైర్ ఇవ్వకపోవడంతో తన కోపాన్ని మీడియా ముందు చూపించాడు
ఇదిలా ఉంటే తాజాగా విరాట్ కోహ్లి తన ఫ్రస్ట్రేషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి కొత్త మందు కనిపెట్టాడు.
అదే పగలబడి నవ్వడం.విరాట్ తన సోషల్ మీడియా ద్వారా ఆర్సీబీ ఆటగాళ్లు యుజ్వేంద్ర చహల్, ఏబీ డివిలీర్స్ తో కలిసి డాన్స్ చేసిన వీడియోని షేర్ చేశాడు.
ఆ వీడియోలో అవసరమైన దాని కంటే ఎక్కువగా చహల్ అత్యుత్సాహంతో డాన్స్ చేయడం చూసి కెప్టెన్ కోహ్లీ పగలబడి నవ్వుతున్నాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్నట్లు ఉన్న కోహ్లి చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిపై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికర వాఖ్యలు చేస్తున్నారు.