టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.రెండు ఏళ్ల క్రితం అనుష్కను పెళ్లి చేసుకున్న కోహ్లీ 2021లో తల్లితండ్రులు కాబోతున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే వారు ఇద్దరు కలిసి దుబాయ్ లో ఆర్సీబీ ఆటగాళ్ల మధ్య సంబరాలు చేసుకున్నారు.
మొన్న శుక్రవారం రోజున ఆర్సీబీ ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తవ్వడంతో అందరూ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్నారు.
ఆతర్వాత ఆర్సీబీ ఆటగాళ్ల మధ్య కోహ్లీ కేక్ కట్ చేసి అనుష్కకు తినిపించాడు.ఈ సందర్భంగా వీరిద్దరికి అందరూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విరాట్ కోహ్లీకి, అనుష్క కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.అంతేకాదు.
చహల్ కూడా ఇటీవల తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకోవడంతో అతను కూడా అందరి మధ్య కేక్ కట్ చేశాడు.ఆర్సిబి ఆ రేంజ్ లో సంబరాలు చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.