భారత స్టార్ క్రికేటర్ విరాట్ కోహ్లి, బాలివుడ్ అగ్రకథానాయిక అనుష్క శర్మ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.చాలాకాలం ఈ విషయాన్ని దాచిపెట్టి దొరక్కుండా తిరిగిన ఈ జంట, ఆ తరువాత పబ్లిక్ గానే తమ ప్రేమ విషయాన్ని ధృవీకరించారు.
ఇక ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయం అనుకుతున్న తరుణంలో పెద్ద షాకే ఇచ్చారు ఇద్దరు కలిసి.
విరాట్ కెరీర్ బ్రహ్మాండంగా నడుస్తోంది.
ఈ కాలంలో ప్రపంచంలోనే అతిగొప్ప క్రికెటర్లలో కోహ్లి ఒకడు.ఇప్పటికే భారత టెస్టు జట్టు నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కోహ్లి, ధోని రిటైర్ అయిన తరువాత మిగిలిన రెండు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా నియమించబడటం జరిగే పనే.ఇన్ని సాధించేసావ్ , ఇక పెళ్లి చేసుకో అని విరాట్ కుటుంబసభ్యులు సూచించారట.ఇదే మాట అనుష్కకి చెబితే, తనకి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఇంకో రెండు మూడు సంవత్సరాలపాటు సినిమా తప్ప ఇంకో ప్రపంచం వద్దని చెప్పేసిందట.
ఆ మాటల్లోనే ఇద్దరికీ గొడవ జరిగిందని సమాచారం.పోనిలెండి ఇది రూమర్ అనుకుందాం.ఇంస్టాగ్రామ్ లో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకున్నారు.కోహ్లి అనుష్కని ట్విట్టర్ లో కూడా ఫాలో అవట్లేదు.
మరి ఇవి దేనికి సంకేతాలో.
ఈ వార్త మీడియాలో రావడం, కోహ్లి అనుష్క అలా అన్ఫాలో చేసుకోవడంతో ఇద్దరికీ చెడిందని, ఇక ఇద్దరు బ్రేక్ అప్ చెప్పెసుకోవడమే తరువాయి అని ఉత్తరాది మీడియా కథనాల మీద కథనాలు రాస్తోంది.