ఒకప్పుడు రెస్టారెంట్ లకు ఫుడ్ టేస్ట్ ను బట్టి అవి మిగతా రెస్టారెంట్ లను తలదన్ని అలా మంచి పేరు సంపాదించుకున్నాయి.కాని ఈ సోషల్ మీడియా కాలంలో ఫుడ్ టేస్ట్ ముఖ్యమైన అంశమైనప్పటికీ ప్రతి రెస్టారెంట్ తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి వినూత్న విధంగా ప్రచారం చేయడం తప్పడం లేదు.
కొన్ని రెస్టారెంట్ లు ఫుడ్ ఛాలెంజ్ లతో కష్టమర్ లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా కొన్ని రెస్టారెంట్ లు మెనూతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.అయితే మీరు ఇప్పుడు చూడబోయే మెనూలో ఉన్నవి చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.
మెనూలో నో లాప్టాప్, నో మొబైల్ ఫోన్, నో లౌడ్ వాయిస్ అంటూ అందులో రాసి ఉంది.అంటే తమ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లు ఫుడ్ ని ఆస్వాదించడం మీదనే దృష్టి పెట్టాలనేది ఆ రెస్టారెంట్ ఒక్క ఆలోచన.
మెనూ విచిత్రంగా ఉంది కదా.ప్రస్తుత కాలంలో ఎంత వినూత్నంగా ఆలోచిస్తే వ్యాపారంలో అంతగా రాణించే అవకాశం ఉంది.మెనూలో ఉన్న రూల్స్ ఏమాత్రం బ్రేక్ చేయవద్దని అక్కడ ఉంటుంది.వచ్చిన వెయిటర్ తో సరసలాడకూడదు,వచ్చిన వెయిటర్ కు ఉచిత సలహాలు ఇవ్వకూడదు అని ఈ మెనూలో రాసి ఉంది.
ఈ వింత మెనూ పూణే కు చెందిన రెస్టారెంట్ లో ఉంది.ఇప్పుడు ఈ మెనూ నెట్టింట్లో వైరల్ గా మారింది.మీరూ ఈ వింత మెనూపై ఓ లుక్కేయండి మరి.