సోషల్ మీడియా బాగా ప్రబలడంతో దేశం నలుమూలలా చోటు చేసుకున్న చిత్రమైన సంఘటనలు వెలికి వస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మహాకాళేశ్వర ఆలయంలో భక్తుల మధ్య పోరు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.ఈ వారం ప్రారంభంలో మహాకాళేశ్వర్ ఆలయంలో రెండు వర్గాల భక్తుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది.
ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆలయం వద్ద ఉన్న ఈ-రిక్షాలో చోటు కోసం భక్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది.
అవును, అప్పటికే అందుకో కూర్చుని పూజలను తిలకిస్తున్న భక్తులను చూసి అక్కడ నిలబడివున్నవారు ఓర్వలేకపోయారు.అనంతరం.భక్తులు వాగ్వాదానికి దిగి ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.సదరు వీడియోలో భక్తులు ఒకరినొకరు దూషించుకుంటూ.
కొట్టుకోవడం చాలా స్పష్టంగా చూడవచ్చు.మరికొందరు వ్యక్తులు పోరాటంలో జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఆఖరికి ఈ తంతు పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.అయితే వారిలో ఈ విషయమై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పడం కొసమెరుపు.దాంతో ఆలయ ప్రాంగణంలో పోలీసుల భద్రత పెంచుతున్నట్టు తెలుస్తోంది.అయితే నెటిజన్లు మాత్రం దీనిని చూసి చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు.‘పుణ్యానికి వెళితే, పాపం ఎదురవ్వడం అంటే ఇదేనేమో’ అన్న మాదిరి కామెంట్స్ చేస్తున్నారు.