టాలెంట్ ఉంటే చాలు.ఆటోమేటిక్గా అవకాశాలు వాటంతట అవే వచ్చేస్తాయని ఇప్పుడు చెప్పొచ్చు.
ఎందుకంటే సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది అలా సక్సెస్ అయ్యారు.తమలో దాగిన ప్రతిభను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించగా, చాలా మందికి అవకాశాలు వచ్చాయి.
అలా సక్సెస్ అయ్యి సెలబ్రిటీలు కూడా అయ్యారు.అలా తాము చేసిన వీడియోలు వైరల్ కాగా, వారికి జీవితంలో మంచి అవకాశాలు కూడా లభించాయి.
ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
సదరు వైరల్ వీడియో వివరాల్లోకెళితే.
సైకిల్ తొక్కుకుంటూ శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి పాడిన పాటకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.వెస్ట్ బెంగాల్లోని భీర్బూమ్కి చెందిన భూబన్ అనే పల్లీల వ్యాపారి పేదవాడు.
ఆయన ప్రతీ రోజు శనక్కాయలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు.ఈ క్రమంలోనే తన పాటల ప్రతిభను ప్రదర్శిస్తుంటాడు.
చక్కగా పాటలు పాడుకుంటూ పల్లీలు అమ్ముతుంటాడు భూబన్.‘బాదామ్ బాదామ్ కచ్చా బాదామ్’ అంటూ సాగే పాటతో జనాన్ని తన వైపుకు ఆకర్షించుకుంటుంటాడు.
ఆ సాంగ్లో ఒక రకమైన రిథమిక్ ఉంటుంది.అలా పాటలు పాడుకుంటూ పల్లీలు అమ్ముతుంటుండగా ఒకరు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అది కాస్త నెట్టింట తెగ వైరలవుతోంది.సదరు వీడియో చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.ఆయన గాయని రాణు మండల్ పాటను తనదైన శైలిలో పాడి శభాష్ అనిపించుకున్నాడు.
అలా భూబన్ తన పాటను పాడుకుంటూనే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.
అతను అలా అద్భుతంగా పాడుతున్న తీరును చూసి ఈయనకు మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తున్నారు.ఈ సంగతులు అలా ఉంచితే.
ఈయన పాటను కొందరు రీమిక్స్ చేసి లాభాలు పొందుతున్నారు.దాంతో వారిపై భూబన్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.