రోజు రోజుకి మానవ జీవితంలో సామాజిక విలువలు తగ్గిపోతున్నాయి అనడానికి ఎన్నో సంఘటనలు రోజు మనం చూస్తూనే ఉంటాం.అలాంటి సంఘటన ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో రాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఓ 70 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలిపై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేశాడు.ఆమెను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చితకబాదాడు.
కింద పడేసి మరి పక్కనే ఉన్న కుర్చీ తో ఆమెను చావబాదాడు.అంతే కాదు అతని కోపం తీరకపోవడంతో ఆ వృద్ధురాలి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు.
బలమైన దెబ్బలకు తట్టుకోలేక ఆ వృద్ధురాలు అక్కడే పడిపోయింది.వ్యక్తి ఆ వృద్ధురాలిపై దాడి చేస్తున్న సమయంలో ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆవిడ వద్దు… కొట్టవద్దని బ్రతిమాలినా అతడు ఎటువంటి కనికరం చూపించకుండా ఆమెపై విరుచుకుపడ్డాడు.
ఈ దారుణ సంఘటన కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఇకపోతే ఆ దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు.
అంత పెద్ద సంఘటన జరుగుతున్న అక్కడి ప్రజలు మాత్రం ఆ ముసలావిడ కాపాడడానికి ఎవరు సాహసించలేదు.ఇందుకు సంబంధించి వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది కాస్తా పోలీసులకు చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు.
అయితే ఇది వరకే ఆ నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారని గజియాబాద్ పోలీసులు తెలియజేశారు.సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన నెటిజన్లు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.
అంతేకాదు ఆ వృద్ధురాలిపై దాడి చేసిన దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.దాడి జరుగుతున్న సమయంలో వృద్ధురాలిని కాపాడేందుకు ఏ ఒక్కరు సాహసించకపోవడం అనేది చాలామంది తప్పుబడుతున్నారు.
మరికొందరు ఇలాంటి ఘోరమైన సమాజంలో మనం జీవిస్తున్నాం అంటూ విమర్శిస్తున్నారు.