అప్పుడప్పుడు పులులు, సింహాలు, చిరుతలు ఇలా జనాల్లోకి వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది ప్రస్తుత రోజుల్లో.ఒకసారి జనాల లోకి ప్రవేశించే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
ఈ తరుణంలో ఒక స్టార్ హోటల్ లోకి అనుకోని అతిధి వచ్చిన సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
గుజరాత్ రాష్ట్రంలోని జూనాఘడ్ లోని ఒక హోటల్ లోకి గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక సింహం హోటల్ గోడ దూకి మరి లోపలికి ప్రవేశించింది.ఈ సంఘటన మొత్తం అక్కడే ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది.
ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతంలో సింహం ఇలా సంచరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అయితే అదృష్టవశాత్తు వల్ల ఎవరికి ప్రాణనష్టం జరగలేదు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా అది కాస్త వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.“సింహాలు వచ్చి పోవడం సర్వసాధారణం అయిపోయింది” అంటూ తెలిపాడు.అదే వీడియో లోనే సింహం హోటల్ గోడపై నుంచి దూకి లోపలికి వెళ్లి మళ్లీ అదే గోడపై నుంచి బయటకు వెళ్లినట్లు మనం గమనించవచ్చు.
ఈ తరుణంలో వీడియోను వీక్షించన ఒక నెటిజెన్ జూనాఘడ్ ప్రాంతం గిర్నార్ కొండలకు సమీపంలో ఉన్న సింహాలు ఇలా తరచుగా జనాలు ఉండే ప్రాంతాల లోకి వస్తూ ఉంటాయి.ఆ సమయంలో హోటల్ లో ఉండే వారు ఎవరు బయటకు రాకపోవడం చాలా అదృష్టం అంటూ వ్యాఖ్యానించాడు.
అయితే ఇలా రావడం కొత్తేమీ కాదు.గతంలో కూడా ఇలా సింహాలు రాత్రిపూట రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా తిరిగి వెళ్ళిన సంఘటనలు ఉన్నట్లు అ ఆ ప్రాంత స్థానికులు తెలియజేసినారు.