ఎవరు పెడుతున్నారో ఎందుకు పెడుతున్నారో తెలియదు కానీ, తెల్లవారేసరికి మాత్రం జనాలు తిరగని ప్రాంతంలో ఓ లోహపు స్తంభం అక్కడక్కడ ప్రత్యక్షమవుతుంది.అవి కాస్త ప్రపంచం మొత్తం మిస్టరీగా మారిపోతుంది.
ఇప్పటివరకు ఇలా మూడు సార్లు జరిగిన తాజాగా మరోసారి బంగారు వర్ణంలో ఉండే లోహపు స్తంభం ఒకటి సౌత్ అమెరికాలోని కొలంబియా లో కనపడింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బంగారు వర్ణంలో ఉన్న లోహపు స్తంభం భూమిలో దానిని పాతి పెట్టినట్లుగా కనబడుతోంది.ఇదివరకు లోహపు స్తంభాల లాగే ఈ లోహపు స్తంభాన్ని కూడా పాతి పెట్టినట్లు కనబడుతోంది.
ఇది వరకు మూడు లోహపు స్తంభాలను ఎవరు పెట్టారో తెలియదు గానీ ఈ లోహపు స్తంభం కూడా ఎవరు పెట్టారో అర్థం అవ్వట్లేదు.అయితే ఇది వరకు ప్రత్యక్షమైన 3 లోహపు స్తంభం కంటే ఇది కాస్త భిన్నం.
ఇదివరకు మూడు లోహపు స్తంభాలు సిల్వర్ తో తయారు చేసినట్లుగా కనిపిస్తుండగా ఇది మాత్రం బంగారు వర్ణంలో మెరుస్తూ ఆశ్చర్యపరుస్తోంది.మొట్టమొదటిగా నవంబర్ నెల చివరిలో మొదటి లోహపు స్తంభం కనపడగా ఆ తర్వాత రెండు రోజులకే దానిని ఎవరో మాయం చేశారో కూడా అంతుచిక్కలేదు.
ఆ తర్వాత మరోసారి యూరప్ లోని పర్వతాల వద్ద మరోసారి కనపడగా, ఆ తర్వాత కాలిఫోర్నియాలోని పర్వతంపై లోహపు స్తంభం కనపడింది.అయితే అందరూ దాని గురించి తెలుసుకునే లోపలే అది మాయం అయిపోయాయి.
తాజాగా ఈ బంగారు వర్ణం సంబంధించి లోహపు స్తంభం కొలంబియాలో ప్రత్యక్షమైంది.అయితే ఈ లోహపు స్తంభాల గురించి ఎన్నో రకరకాల వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
వీటిని ఏలియన్స్ పెట్టాయని కొందరు అంటుంటే మరికొందరు ఇది పూర్తిగా మనుషుల పని అంటూ వాదించే వారు కూడా ఉన్నారు.