మనం సాధారణంగా దొంగతననికి పాల్పడే వారు చేసే సాహసాలు ఎన్నో చూసి ఉంటాం.అదే ఎటిఎంలో పెద్ద ఎత్తున మరి జాగ్రత్తులు తీసుకుంటూ పెద్ద మొత్తంలో డబ్బులు దొంగతనం చేసిన సంఘటనలు ఎన్నో చూశాం.
కానీ మనం ఏటీఎం సెంటర్స్ లో శానిటైజర్ బాటిల్స్ ను దొంగతనం చేసిన సంఘటన ఎప్పుడు చూసిఉండము.ఐతే తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది..
ఓ వ్యక్తి సదరు ఏటీఎం కేంద్రానికి వచ్చి కరోనా నిబంధనలు పాటిస్తూ అక్కడ ఉండే శానిటైజర్ వినియోగించుకొని తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ద్వారా ముందుగా డబ్బులను విత్ డ్రా చేసుకున్నాడు.
అయితే ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ కాసేపు తర్వాత అక్కడ ఉన్న శానిటైజర్ బాటిల్ ను తీసుకోని తనా భుజాన ఉన్న బ్యాగ్ లో చాలా భద్రంగా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ఈ తతంగమంతా అక్కడే ఉండే సీసీ కెమెరాల్లో రికార్డయింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది అయితే ఒక చదువుకున్న వ్యక్తి లాగ కనిపిస్తున్న అతను ఇలా చేయడం సరికాదు అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను ఓ లుక్ వేయండి.