ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకి కరోనా వైరస్ ఎక్కువ అవుతుంది తప్పించి తగ్గట్లేదు.
ఇక ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో పిల్లలకి స్కూల్స్ లేకుండాపోయాయి.కేవలం కొన్ని స్కూలు మాత్రం రోజుకి కొద్ది సమయం వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నాయి.
ఇలా చాలాకాలం ఇంట్లో ఉండలేక చెన్నై నగరానికి చెందిన ఓ 14 సంవత్సరాల బాలిక తన అన్నయ్య తో డేంజర్ గేమ్ ఆడింది.
వారు నివసిస్తున్న అపార్ట్మెంట్లో ఏకంగా 23 అంతస్తులో బయటికి ఉన్న ఇరుకైన పిట్టగోడ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నడిచింది.
ఇలా ఏకంగా మూడుసార్లు ఆ అమ్మాయి ఆ పిట్ట గోడపై నడిచింది.ఇలా నడుస్తుండగా ఆ అపార్ట్మెంట్ కు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సంఘటన చెన్నై నగరం శివారు ప్రాంతమైన కేలంబక్కంలోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో జరిగింది.14 సంవత్సరాలు ఆ బాలిక తన అన్నయ్యతో ప్రమాదకరమైన చాలెంజ్ వేసి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది.
అయితే ఇందుకు సంబంధించి వీడియో పోలీసులకు చేరడంతో వారు ఆ భవనాన్ని గుర్తించి విచారణ చేపట్టారు.
చివరికి ఆ బిల్లింగ్ ఎక్కడ ఉందో కనుక్కున్న పోలీసులు వెంటనే అపార్ట్మెంట్ ను పోలీసులు సందర్శించి ఆ అన్నా, చెల్లెలు ఇద్దరిని మందలించారు.అంతేకాకుండా భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా సదరు అపార్ట్మెంట్ యాజమాన్యానికి పోలీసులు అపార్ట్మెంట్ లెడ్జ్ ను మూసివేయాలని హెచ్చరికలు చేశారు.
ముందుగా కొందరు ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో జరిగిందని తెలిపిన చివరికి ఈ సంఘటన జరిగింది చెన్నైలో అని తెలిసింది
.