దెయ్యం అంటే ఎవరికైనా భయమే.అయితే ఈ రోజుల్లో దెయ్యం ఏంటని చాలా మంది అంటూ ఉంటారు.
కొందరు దెయ్యం ఎక్కడుందని ప్రశ్నలు వేస్తుంటారు.ఇంకొందరు దెయ్యాలే ఉండవని చెబుతుంటారు.
అయితే కొంత మంది తాము రాత్రిల్లో దెయ్యాన్ని చూశామని చెప్పుకోవటమే కాదు అందుకు సాక్ష్యాలను కూడా చూపిస్తుంటారు.దెయ్యాలు ఉన్నాయని చెబుతూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.
అవి కాస్తా నెట్టింట హల్ చల్ చేస్తాయి.ఈ మధ్య కాలంలో అటువంటి వీడియోలు చాలానే ఉన్నాయి.
వాటిని చూసిన ప్రతి ఒక్కరూ దెయ్యం నిజంగా ఉందేమోనని టెన్షన్ పడటం ఖాయం.తాజాగా ఓ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
కొలంబియాలోని ఓ మేయర్ దెయ్యం భయాన్ని కళ్లారా చూశాడు.కొలంబియాలో ఉన్నటువంటి ఆర్మేనియన్ సిటీ మేయర్ జోస్ మాన్యూల్ రియోస్ మొరాల్స్ తన యొక్క ఫేస్బుక్ పేజీలో ఓ వీడియోను పోస్టు చేశాడు.
ఆ వీడియో ఎంతో భయంతో కూడుకున్నది.అందులో తాను నగరంలోని ఒక సీసీటీవీ ఫుటేజ్ని పోస్టు చేయడంతో అందరూ ఆశ్చర్యకరంగా చూశారు.తాను అలా వీడియో పోస్టు చేయడానికి ఓ దెయ్యమే కారణమని తెలిపాడు.తన ఆఫీస్ లో ఓ భయంకర ఘటన జరిగిందని తెలిపాడు.
ఓ దెయ్యం తన ఆఫీసులోని వ్యక్తిని చితక్కొట్టిందని పేర్కొన్నాడు.ఆయన పోస్టు చేసిన వీడియోలో ఓ సెక్యూరిటీ గార్డు నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ ఎవ్వరూ లేరు.దీంతో ఆ వ్యక్తిని ఓ దెయ్యం తోసి కింద పడేసింది.ఆయన్ని పక్కకి లాగి పడేసింది.అయితే ఆయనకు ఎవ్వరూ కూడా కనిపించలేదు.దీంతో ఆయన భయంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే ఉండాల్సి వచ్చింది.
కొంత సేపటికి ఆయన అరుపులు విన్న ఇద్దరు మనుషులు అక్కడికి వచ్చి చేరారు.సెక్యూరిటీ గార్డును దెయ్యమే ఇలా చేసిందని వీడియో ద్వారా తెలుస్తోందని తెలిపాడు.
.