నేడు జరగబోయే భారత్, పాకిస్థాన్( India and Pakistan ) ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీకి ముందు, దిగ్గజ క్రికెటర్ ఆటగాళ్ళైనా సచిన్, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆదివారం న్యూయార్క్లోని టి20 ప్రపంచకప్ 2024 ఫ్యాన్ పార్క్ లో బేస్బాల్ ఆడుతూ కనిపించారు.
ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ పాత ద్వారా షేర్ చేసింది.
ఈ వీడియోలో సచిన్ టెండూల్కర్ బేస్బాల్ బ్యాట్ తీసుకొని స్ట్రైక్ లో ఉండగా మరోవైపు ఎడమ చేతిలో కుడి చేతిలో బాల్ తీసుకొని బాలు వేయడానికి రవి శాస్త్రి ( Ravi sastri )రెడీగా ఉన్నాడు.
ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్( T20 World Cup ) లో టీమిండియా ఐర్లాండ్ పై భారీ విజయం సాధించగా.పాకిస్థాన్ పరిస్థితి కాస్త ఘోరంగా ఉంది.పాకిస్తాన్ చివరగా జరిగిన మ్యాచ్లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో విజయం సాధించి సూపర్ 8 లో స్థానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది.
ఇక వైరల్ ( Viral )గా మారిన వీడియోలో రవి శాస్త్రి బౌలింగ్ చేస్తూ తన కామెంట్రీని చేసినట్లుగా మాట్లాడాడు.ఇందులో భాగంగా.బాల్ వేసే ముందు.
"సిద్ధంగా ఉండండి.ఇది ఇప్పుడు నాట్ల రేటుతో వస్తోంది " అంటూ వ్యాఖ్యానించాడు.
ఇక ఆ తర్వాత రెండు బాల్స్ వేసిన శాస్త్రి చివరగా., "అయిపోయింది.
ఆట ముగిసిపోయింది" అంటూ మాట్లాడటంతో వీడియో ముగుస్తుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఇక నేడు న్యూయార్క్( New York ) వేదికగా టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy