ఆసీస్ టెస్ట్ సిరీస్ లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా క్రికెట్ ఆటగాళ్లు వారం రోజుల్లోనే స్వదేశంలో జరగనున్న మరో టెస్ట్ సిరీస్ లో ఆడనున్నారు.ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ ని ఆడనున్నారు.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో పాల్గొనే ముందుగా టీమిండియా క్రికెట్ ఆటగాళ్లు 6 రోజుల పాటు క్వారంటైన్ లో గడుపుతున్నారు.
అయితే టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే చెన్నై హోటల్ లో తన కూతురు తో డాన్స్ చేస్తూ కనిపించి అందరినీ ఫిదా చేస్తున్నారు.
వీళ్లిద్దరి డాన్సింగ్ కి సంబంధించిన వీడియోని అజింక్యా రహానే భార్య రాధికా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.క్వారంటైన్ టైంలోనే రహానే తన కూతురు తో స్టెప్పులు వేయడం చూసి క్రికెట్ అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.ఈ వీడియోకి ఇప్పటికే ఒక లక్ష 22 వేల వ్యూస్, 46 వేల లైకులు వచ్చాయి.
అయితే ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్ మూడు వికెట్ల తేడాతో గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని ఇండియన్ క్రికెట్ టీం సొంతం చేసుకుంది.అయితే చాలామంది కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఆసీస్ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగడంతో బాధ్యత అంతా కూడా రహానే మీదనే పడింది.అయితే విరాట్ కోహ్లీ కూడా దూరం కావడంతో రహనే ఒక్కరే చాలా చాకచక్యంగా కెప్టెన్సీ చేసి భారతదేశ క్రికెట్ జట్టు ని గెలిపించారు.అయితే ఇంగ్లాండ్ తో జరగనున్న సిరీస్ లో మాత్రం విరాట్ కోహ్లీ ఆడనున్నారు.
భారతదేశంలోని పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టులో ఇండియన్ క్రికెట్ టీమ్ మొత్తం నాలుగు టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు, 5 T20 మ్యాచులు, 3 వన్డే మ్యాచ్ లు ఆడనుంది.