ప్రస్తుతం కరోనా వైరస్ పెద్ద ఎత్తున విజ్రుంభిస్తోంది.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.అయితే మొదటి దఫాలో కేసులు భారీగా నమోదయినా, మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదవుతున్నాయి.
రెండో దఫాలో కేసులు భారీగా నమోదవుతూనే మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.దీంతో ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ విధించక తప్పడం లేదు.
అయితే ఆసుపత్రులలో కోవిడ్ మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే కొన్ని చోట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి.అయితే ఉత్తర్ ప్రదేశ్ లో సిబ్బంది చేసిన తీరు దేశం మొత్తం విస్మయానికి గురవుతోంది.ఏకంగా పట్టపగిలే కోవిడ్ మృతదేహాన్ని నదిలో పడవేస్తున్న వైనం ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన వాళ్ళు విస్మయానికి గురైన పరిస్థితి ఉంది.
ప్రాణాలంటే లెక్కలేదా అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది.కరోనా కాలంలో కనీసం మరణానికి విలువ లేకుండా పోతోందని, హూందాగా నిర్వహించాల్సిన సమయంలో ఇలా చేయడం చాలా ఘోరమని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.