అడిలైట్ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది.
టీమిండియా పెట్టిన 90 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సునాయాసంగా చేధించింది.కేవలం 21 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా చేరుకోవడంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అయితే ఆసీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ మాథ్యూ వేడ్ ను ఇండియన్ క్రికెట్ పేపర్ వృద్ధిమాన్ సాహా అవుట్ చేసిన విధానం మాత్రం ఇండియన్ అభిమానుల్లో కాస్త ఆనందాన్ని నింపింది.
సాహా.మాథ్యూ వేడ్ ను రనౌట్ చేసిన తీరు అచ్చం ఎంఎస్ ధోని తీరునే గుర్తుకు తెస్తోంది.టీమిండియా తరపున ఎంఎస్ ధోని ఆడినప్పుడు కీపర్ గా ఉండి అనేక మంది బ్యాట్ మెన్ లను రన్ అవుట్ చేశారు.
ఈ రన్ అవుట్ లన్ని కూడా అందరికీ షాక్ ఇచ్చాయి.అయితే తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా వృద్ధిమాన్ సాహా ధోని తరహాలోనే మాథ్యూ వేడ్ ను రనౌట్ చేశారు.
రవిచంద్రన్ అశ్విన్ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని వేడ్ ఫ్లిక్ చేయగా.ఆ బంతిని కీపర్ సాహా పట్టుకున్నాడు.
ఆ వెంటనే అతను.తన కాళ్ల సందుల నుంచి బంతిని వికెట్లకు విసిరేసాడు.
రెప్పపాటు వేగంతో ఆ బాల్ వికెట్లను ఢీ కొట్టింది.అయితే వేడ్ అప్పటికే క్రీజు దాటి ముందుకు వెళ్ళాడు.
దీంతో రనౌట్ అయ్యాడు.అయితే ఈ రన్ ఔట్ ధోని ని అభిమానులతో గుర్తుకు తెచ్చింది.
ప్రస్తుతం ఈ అకౌంట్ కి సంబంధించిన వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.డిసెంబర్ 26వ తేదీన ఇరు జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్నది.
విరాట్ కోహ్లీ వ్యక్తిగత విషయాల రిత్యా సెలవు తీసుకొనుండగా అజింక్యా రహానే క్యాప్టెన్ బాధ్యతలను వ్యవహరించనున్నారు.