నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట విశ్వరూపం నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా సినీ ప్రముఖులు, డైరెక్టర్లు నిర్మాతలు వారి స్టైల్ లో ఘన నివాళులు అర్పిస్తున్నారు.ఈ సందర్భంగా తాజాగా నిర్మాత రామ్ ఆచంట సోషల్ మీడియా వేదికగా నందమూరి తారక రామారావు కి ఘన నివాళులు అర్పించారు.
సోషల్ మీడియా వేదికగా ‘మరణం లేని జననం’ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు o వీడియో షేర్ చేశారు.
అంతేకాకుండా ఆ పోస్టులో ఒక వీడియోను తన అభిమానులతో పంచుకున్నాడు రామ్ ఆచంట.
ఎన్టీఆర్ కుమారుడు టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య డైలాగ్ తో ప్రారంభమయ్యే ఈ వీడియో అభిమానులు బాగా ఆకట్టుకుంటుంది.ఈ వీడియోలో “సింహం నిద్ర లేచి గడపదాటి జనం లోకి వచ్చి గర్జిస్తే.
, ఆ గర్జనకు ఢిల్లీ మ్యాప్ షేప్ మారిపోతుంది ” అంటూ ఉండే డైలాగ్స్ వీడియో ఎన్టీయార్ అభిమానులను బాగా ఆకర్షిస్తుంది.
ఇక తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు అద్భుతమైన నటుడిగా తనదైన ముద్రను వేసుకున్నారు.అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టి అంతటి ఘనతను సొంతం చేసుకున్నారు.ఇది ఇలా ఉండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ రామ్ ఆచంట గోపి ఆచంట బ్లాక్ బ్లాస్టర్ సినిమాలను అందించిన సంగతి అందరికి తెలిసిందే.
ప్రస్తుతం రామ్ ఆచంట షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.