మనకు తెలిసినంత వరకు చేపల వర్షం, వడగండ్ల వర్షం అని చాల సార్లు చూశాం విన్నాము.ఇక పూర్వకాలంలో రాజులు కాసుల వర్షం కురిపించే వాళ్ళు అని పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాం.
అయితే నేటి సమాజంలో డబ్బు కోసం సొంతవారినే చంపేసుకుంటున్నారు.ఇలాంటి రోజుల్లో ఆ దేశంలో గంటపాటు డబ్బుల వర్షం కురిసింది.
ఇక ఆ డబ్బులు వర్షం కురిసింది మన పక్క దేశమైన పాకిస్తాన్ లో ఈ మాట వింటే మీరు షాక్ అవ్వుతున్నారు కదా.అవును పేద దేశం పాకిస్తాన్ లో విచిత్రంగా డబ్బుల వర్షం కురవడం అందరికీ షాక్ ఇచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నరోవాల్ లో ఇటీవల ఓ వివాహం జరిగింది.ఈ పెళ్ళికి చాలా మంది బంధువులు కూడా హజారయ్యారు.
అయితే వధువువరులు ఇద్దరూ ఇంటి కింద నిల్చుని ఉన్నారు.ఆ తర్వాత నవ్రా దేవా కుటుంబ సభ్యులు డాబా ఎక్కారు.
అంతలో డాబా మీద నుంచి లక్షల నోట్లను గాల్లోకి విసిరారు.దీంతో ఈ నవ దంపతులపై నుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది.
అంతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకుపై పెద్దలు అక్షితలు జల్లినట్లుగా కరెన్సీని చల్లారు.అవి గాలిలో ఎగురుతూ కిందపడ్డాయి.
ఇక డబ్బులు అలా కింద పడుతుంటే ఆ ప్రాంత ప్రజలు పైసా అంటూ వాటిని పట్టుకున్నారు.అక్కడ ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ ఘటన పాకిస్థాన్ లో నోట్ల వర్షం అంటూ వైరల్ అయ్యింది.నెట్టింట్లో వీడియో హల్ చల్ చేస్తుంది.
ఇంతకీ ఆ నోట్ల వర్షం ఎంత అంటే దాదాపు రెండు లక్షల రూపాయాలు అని తెలిసింది.
అసలే ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ లో ఈ రేంజ్ లో పెళ్లిళ్లు చేసే స్టేజ్ లో ప్రజలు ఉన్నారా ? అనే చర్చ ప్రారంభమైంది.అయితే పెళ్లి కొడుకు సోదరుడు అమెరికాలో ఉంటున్నాడు పెళ్లికోసమే పాకిస్థాన్ వచ్చినట్లు తెలిసింది.తమ ఇంట్లో పెళ్ళికి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు.అందుకనే ఆ డబ్బుని ఇలా వర్షంలా వేశాడట ఆ డబ్బుని తీసుకున్న పేదవారు ఎంతో సంతోష పడ్డారు.ఇలాంటి పెళ్లిని సందర్భాన్ని ఇప్పటి వరకూ చూడలేదని వారు అభిప్రాయాన్ని తెలిపారు.