క్రీడలు అనేవి ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.ఏ ఆట ఆడినా గెలుపు, ఓటములు సహజం.
ఒకరు గెలవాలంటే ఒకరు ఓడిపోవాలి.అయితే మరల ఓటమి నుండి విజయం దిశగా సాగాలంటే నూతన ప్రణాళికలు వేయాలి.
అప్పుడే విజయం అనేది మన వెంబడి ఉంటుంది.అయితే ప్రతి క్రీడకు కొన్ని నిబంధనలు ఉంటాయి.
ఆ నిబంధనల మేరకే ఆటలు ఆడాల్సి ఉంటుంది.అది అంతర్జాతీయ క్రీడలు అవచ్చు, లేక జిల్లా, స్థాయి క్రీడలు అవచ్చు.
ఏవైనా సరే రూల్స్ ప్రకారం ఆట ఆడినప్పుడే ఆటకు వన్నె తెచ్చిన వారమవుతాం.లేకపోతే చూసే వారికి ఆట మీద గౌరవం పోతుంది.
దొంగ దెబ్బ తీసి ఆటగాడిని ఔట్ చేస్తే అది క్రీడా స్పూర్థికి విరుద్ధం.
అచ్చం ఇలానే జరిగింది సౌతాఫ్రికా, పాకిస్తాన్ మ్యాచ్ లో.పాకిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్ లో పాకిస్తాన్ ను గెలిపించడానికి పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు.అప్పుడు 193 రన్స్ చేసి వీరచితంగా పోరాడుతూ పాకిస్తాన్ ను ఒంటి చేత్తో గెలిపిస్తాడా అనేంతలా బ్యాటింగ్ చేస్తున్నాడు.
అదే సమయంలో రన్ కు వస్తున్న సమయంలో కీపర్ క్వింటన్ డికాక్ పాక్ ఆటగాడు ఫకర్ ను మోసం చేసి ఔట్ చేసాడని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ క్రికెట్ పండితులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే నాన్ స్ట్రైకింగ్ లో బంతి అందుకోవాల్సిందిగా డికాక్ సైగ చేయడంతో బంతి త్వరగా రాదని ఊహించి మెల్లగా క్రీజులోకి చేరుకున్నాడు.ఇంతలోపే బంతి స్టoప్స్ ని తాకింది.
ఇది చాలా మోసమని, ఎంపైర్ కూడా స్పందించక పోవడంతో ఫకర్ వెనుదిరగక తప్పలేదు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
డికాక్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.