మనం ఉండే చోటులో పచ్చటి పొలాలు, చల్లటి వాతావరణం పక్షుల కిలకిల రాగాలు ఇలాంటి వాతావరణంలో ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.ఇక మనకు అక్కడి నుండి వెళ్ళడానికి మన మనసు ఒప్పుకోదు.
మనమే ఇటువంటి మంచి వాతావరణాన్ని ఇంతలా ఇష్టపడుతుంటే ఇక పశుపక్ష్యాదులు ఎంతలా ఇష్టపడతాయో మనం ఊహించవచ్చు.ముఖ్యంగా నెమలి ప్రకృతిని ఆస్వాదించినంతగా ఎవరూ, ఏ పక్షి కూడా ఆస్వాదించదనే చెప్పవచ్చు.
నెమలి జోరు వర్షం కురుస్తే చాలు.ఇక ఫించం విప్పి నాట్యమాడితే కన్నుల విందుగా అనిపిస్తుంది.
తాజాగా ప్రకృతిలో మై మరిచిపోతూ నెమలి నాట్యం ఆడింది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే మహారాష్ట్రలోని రాజ్ భవన్ లో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైనది.
సాయంత్రం పూట రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు కురవడంతో ప్రకృతి రమణీయంగా తయారయింది.అయితే ఆ సమయంలో రాజ్ భవన్ లో ఉన్న హెలిప్యాడ్ మీద ఓ నెమలి వచ్చి వాలింది.
ఇక వాతావరణం హాయిగా ఉండడంతో ఇక హెలిప్యాడ్ పై నెమలి పురి విప్పి నాట్యమాడింది.ఈ దృశ్యాలు అక్కడ ఉన్న వారిని కనువిందు చేశాయని చెప్పవచ్చు.ఇక అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో వదలడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ ఆసక్తికర వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.