ఇండియా క్రికెట్ టీమ్ లో చాలా మందిని ప్రత్యేకంగా చూస్తారు.ప్రతి క్రికెటర్ ను ఓ ప్రత్యేక విషయం మీద పోల్చుతూ పొగుడుతుంటారు.
తాజాగా టీమిండియాలో పాండ్యా బ్రదర్స్ చూపిస్తున్న అసమాన్య ప్రతిభ అందర్నీ ఆకట్టుకుంటోంది.హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా గురించి ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఈ ఇద్దరూ అన్నదమ్ములు ఎక్కడుంటే అక్కడా ఎనర్జీ అనేది ఉంటుందని అందరూ చర్చించుకుంటుంటారు.గ్రౌండ్ లోపల, బయటా వీరిద్దరి చేసే సందడి అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ప్రత్యర్థుల్ని కవ్వించడంలో ఈ బ్రదర్స్ అలవోకగా ప్రవర్తిస్తుంటారు.ప్రత్యర్థి ఆటగాళ్లకు సవాళ్లు విసురు కుంటూ ఛాలెంజులు చేయడం వీరికి అలవాటు.
అయితే, తాజాగా ఈ పాండ్యా బ్రదర్స్ ఒకరిపై మరొకరు సవాల్ చేసుకున్నారు.తాజాగా గా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా పోటీపడ్డారు.
వీరిద్దరూ జిమ్లో కసరత్తులు చేసి ఒకరిపై ఒకరు గెలవాలని అనుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.అది చూడటానికి తేలికగా ఉన్నప్పటికీ అంత సులభమైనది కాదు.ఈ సవాళ్లను ఇంట్లో ప్రయత్నించాలంటే జాగ్రత్త వహించాలంటూ బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది.
పాండ్యా బ్రదర్స్ ఇప్పుడు శ్రీలంక పర్యటనలో ఉన్నారు.వారిద్దర జట్టు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ హర్ష ఆధ్వర్యంలో ఫిట్నెస్ నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
అక్కడ మొత్తం మూడు విభాగాల్లో వీరిద్దరూ పోటీలో పాల్గొన్నారు.అందులో ఫస్ట్ గోడకుర్చీ వేయగా కృనాల్ పాండ్య విన్ అయ్యాడు.
ఇక రెండో దాంట్లో గ్లూట్ బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ (నేలపై పడుకొని నడుము నుంచి కాళ్ల వరకు గాలిలో ఉంచడంలో హార్దిక్ విజయం సాధించాడు.దీంతో ఇద్దరూ సమానంగా నిలిచారు.
ఇక, చివరికి మూడో దాంట్లో స్ల్పిట్ స్క్వాట్ హోల్డ్ అంటే ఒక కాలును వెనక్కి పెట్టి మరో కాలును ముందుకు వంగి నిల్చోవడం చేశారు.ఇందులో ఇద్దరూ సమానంగా నిలిచారు.
చివరికి ఈ పోటీలో అన్నదమ్ములిద్దరూ విజేతలుగా నిలిచారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది.