పిల్లలు అన్నాక ఎంత సేపని ఇంట్లో ఉంటారు చెప్పండి.సరదాగా కాసేపు సాయంత్రం పూట తోటి పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటారు కదా.
సరిగ్గా అలాగే కొంతమంది పిల్లలు కూడా రాత్రికి 7 గంటల సమయంలో ఆడుకోవడానికి కాలనీ బయటకు వచ్చారు.ఒక్కచోటికి అందరు వచ్చి సరదా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఆడుకుంటున్నారు.
అప్పుడే ఓక పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి మిగతా పిల్లలతో ఆడుకోవడానికి రెడీ అయ్యాడు.కానీ ఆ పిల్లల ఆనందం ఎంతో సేపు ఉండలేదు.
ఒక్కసారిగా భారీ శబ్దంతో ఒక కారు అదుపుతప్పుతూ పిల్లల మీదకు దూసుకుని వచ్చింది.అంతే పిల్లల ముఖంలో అప్పటివరకు ఉన్న నవ్వు చెదిరిపోయి భయభ్రాంతులకు గురి అయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అసలు ఇంతకీ ఈ కారు బీభత్సం ఎక్కడ జరిగందంటే.
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాయినగర్ అనే కాలనీలో జరిగింది.శుక్రవారం రోజున సాయినగర్ కాలనీ లోకి ఒక కారు అతివేగంగా దూసుకుని వచ్చింది.
ఆ కారును చూస్తే నూతనంగా కొనుగోలు చేసిన కారులా ఉంది.కొత్త కారు కావడంతో అతి ఉత్సహంతో డ్రైవర్ అతి వేగంగా కార్ ను నడిపాడు.
దాంతో ఆ కారు కాస్త అదుపు తప్పి సాయి నగర్ కాలనీలోని గోడలను గుద్దుకుంటూ మరి వచ్చి అక్కడే ఆడుకుంటున్న పిల్లల వైపు వచ్చింది.
ఆ పిల్లల అదృష్టం బాగుండడంతో ముందుగా ఆ ప్రమాదాన్ని పసిగట్టి భయంతో ఎక్కడివాళ్ళు అక్కడ పరుగులు పెట్టారు.అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎంతటి దారుణం జరిగిందనే చెప్పాలి.ప్రాణ హాని అయితే జరగలేదు కానీ, పిల్లలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఆ పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కదా.ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న బైక్ ను కార్ గుద్దడంతో బైక్ చెల్లా చెదురు అయిపోయింది.అయితే ఈ ప్రమాదానికి సంబందించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
అది ఇప్పుడు వైరల్ గా మారింది.అతి వేగం ప్రమాదకరం అని ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా చెప్పినాగాని కొంతమందిలో మాత్రం మార్పు అనేది రావడంలేదు అనడానికి ఈ ఘటన మంచి ఉదాహరణ.