మనం చిన్నపుడు బుక్స్ లో చాలా కథలు చదువుకొనే ఉంటాము.మీరు చదివిన కథలలో ఎలుగుబంటి కథ మీకు గుర్తుండే ఉంటుంది.
ఇద్దరు మిత్రులు అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు.అయితే దూరంగా ఓ ఎలుగుబండి వారి వైపు రావడం గమనిస్తారు.
ఇక ఎలుగుబంటి నుండి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అడవి నుండి పారిపోతుంటారు.ఎలుగుబంటి దగ్గరగా రావడంతో ఓ వ్యక్తి చెట్టు ఎక్కి కూర్చోగా మరో వ్యక్తికి ఎక్కడం రాదు.
ఇక ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థంకాక అతను ఉన్న చోటే పడుకొని చనిపోయినట్లుగా నటిస్తాడు.అతని దగ్గరకు వచ్చిన ఎలుగుబంటి చనిపోయాడు అనుకొని వెళ్లిపోతుంది.సరిగ్గా ఈ కథలో రెండో అబ్బాయి చేసినట్లే చేసింది ఓ ముంగీస.శవంలా పడి ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉండదు అని అది ఆలోచించడం ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం.
అయితే ఇందులో రెండు ముంగీసలు ఆడుకుంటుంటే హార్న్ బిల్ పక్షి వాటికి సమీపంలోకి వస్తుంది.దాంతో ఓ ముంగీస పక్షి దగ్గరకు వెళ్లి ఆ పక్షి చూస్తున్నప్పుడు శవంలా పడి ఉంటోంది.
పక్షి వేరేవైపు చూస్తున్నప్పుడు పైకి లేచి.పక్షి ఏం చేస్తోందా అని చూస్తోంది.
అలా మూడుసార్లు శవంలా పడి నటించింది.ఇలా ఆ ముంగీస పక్షి నుంచి హాని రాకుండా జాగ్రత్త పడటం నెటిజన్లకు బాగా నచ్చుతోంది.
ఇన్స్టాగ్రామ్ లోని ఈ వీడియోను చాలా మంది చూస్తున్నారు.
ఇక వీడియో చూసిన నెటిజన్స్ అంత తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ వీడియో మీరు కూడా ఒక్కసారి చూడండి.ఇక ఆశ్చర్యకరం ఏంటంటే అసలు ముంగీస అలా ఎలా ఆలోచించగలుగుతోంది అన్నది.
మనం మనుషులం కాబట్టి మనకు తెలివితేటలు ఉంటాయి.కానీ మూగ జీవాలకు కూడా తెలివితేటలు ఉంటాయని చాలా జంతువులు నిరూపించినట్లే ఇక్కడ ముంగీస కూడా నిరూపించింది.