వైరల్ వీడియో : రెచ్చిపోయిన పోకిరీలు.. నడిరోడ్డుపై కారును కాలుతో తంతూ..!

ఈ మధ్యకాలంలో కొందరు యువత వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.చదువు మానేసి.

పని పాట లేకుండా., రోడ్లపై స్కూటీలు, బండ్లను వేసుకొని వారికి ఇష్టానుసారంగా ప్రవర్తించడం సంబంధించిన ఘటనలు ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కువగానే జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే పలు క్రైమ్ సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.తాజాగా బెంగళూరు( Bangalore ) నగరంలో కొందరు పోకిరిలు రెండు స్కూటీ లపై మొత్తం ఆరు మంది ప్రయాణం చేస్తూ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

Advertisement

బెంగళూరు నగరంలోని మారేనహాల్ని నుండి సిల్క్ బోర్డు( Silk board ) కు వెళ్లే ఫ్లై ఓవర్ పై కొందరు యువకులు రెచ్చిపోయారు.రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ స్కూటీలలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఫ్లైఓవర్ పై వెళ్తున్న ఒక కారుని కాలుతో తన్నుకుంటూ ఆ కారులో వారిని బూతులు తిడుతూ వెళ్లడం వీడియోలో గమనించవచ్చు.అంతేకాదు కారును దాటుకొని వెళ్లి ముందర కూడా వారి ఇష్టానుసారం డేంజరస్ స్టంట్స్ చేస్తూ పోకిరిలు రెచ్చిపోయారు.

దారిన వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తూ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం వీడియోలో పూర్తిగా గమనించవచ్చు.ఈ వీడియోని చూసిన చాలామంది నైటిజన్స్ ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు.ఇక మరికొందరేమో.

ప్రతిరోజు ఇటువంటి వారి వల్ల అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.వీరిని దేవుడు ఎందుకు త్వరగా తీసుకెళ్లిపోవడో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

భారతీయుడు 3 లో నటించనున్న స్టార్ యాక్టర్... అంచనాలను పెంచుతున్నారుగా...
Advertisement

తాజా వార్తలు