కంటికి కనిపించని కరోనా మహమ్మారి మనుషుల జీవితాలను చాలా దుర్బరంలోకి నెడుతోంది.కరోనా దెబ్బకు ఒక్కొక్కరి జీవితాలు తల క్రిందులైనాయని చెప్పవచ్చు.
మొదటి కరోనా వేవ్ ముగిసి ఇక మరల తిరిగి కొత్త జీవితాలను ప్రారంభిద్దాం అనుకునే లోపే సెకండ్ వేవ్ రూపంలో కరోనా ఉప ద్రవం ముంచుకొచ్చింది.దీంతో ఒక్కసారిగా జన జీవనం స్థంభించిపోయిందని చెప్పవచ్చు.
మొదటి దఫా కరోనా వేవ్ లో కేసులు భారీగా నమోదైనా, మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం కేసులు భారీగా నమోదవుతూనే, మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి.
దీంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.అయితే మనుషులం కాబట్టి సమయానికి మనకు ఏం కావాలి అన్నది మనకు తెలుస్తుంది.ఇంకా ఎవరైనా సహాయం కోరితే సహాయం చేయడానికి ముందుకొస్తారు.కాని ఇంతటి క్లిష్ట సమయంలో మనుషులు బయట తిరగనప్పుడు మూగజీవాలకు కూడా ఆహారం అనేది దొరకదు.దీంతో మూగ జీవాల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిన పరిస్థితి ఉంది.అయితే ఇటువంటి పరిస్థితి పట్ల చలించి మహారాష్ట్ర లోని నాగపూర్ కు చెందిన రంజిత్ నాథ్ అనే జంతు ప్రేమికుడు మూగజీవాలకు అండగా నిలుస్తున్నాడు.
రోజూ ప్రొద్దున వాటికి చికెన్ బిర్యానీ వండుకొని వచ్చి వాటి ఆకలి తీరుస్తున్నాడు.ఇక ఈ వ్యక్తి సేవా గుణానికి నెటిజన్లు సలాం చేస్తున్నారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.