కరోనా దేశంలో విలయతాండవం చేస్తోంది.అసలు ఇప్పటికే చాలా మంది ప్రజలు కరోనా బారిన పడి మృతి చెందుతున్న సంఘటనలు రోజూ చోటు చేసుకుంటున్నాయి.
కరోనా సోకిన కుటుంబంలో కరోనా మృతి సంభవించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.అయితే కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు, కొంత మంది అలవోకగా తిరిగి వస్తున్నారు.
అయితే కరోనాకు ఇప్పటికీ ఒక వ్యాక్సిన్ తప్ప పెద్దగా ఖచ్చితమైన నివారణకు మాత్రం ఎటువంటి వ్యాక్సినేషన్ రాలేదు.దీంతో కరోనా బారిన పడిన వారు ఎలా కోలుకోవాలో ఖచ్చితమైన పద్ధతి తెలియక నానా హైరానా పడుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చి కరోనా నుండి ఎలా బయటపడాలి అనే విషయాలపై కొన్ని సూచనలను అభిమానులకు, ప్రజలకు తెలియజేశారు.కరోనా బారిన పడితే మనో బలమే మనకు శ్రీరామ రక్ష అని, కరోనా వచ్చిందని కంగారు పడితే, మానసికంగా బలహీనంగా ఉంటే కరోనా మనల్ని కబలించి వేసే అవకాశమున్నదని చిరు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇంతటి క్లిష్ట సమయంలో కరోనా పట్ల ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్న మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.