తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ నగరంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సంఘటనలో ఓ యువకుడిని ఏకంగా గంట పాటు రోడ్డు మీద బట్టలు లేకుండా నడిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.రాజ్ కోట్ పట్టణానికి చెందిన 38 సంవత్సరాల చందు అనే ఒక వ్యక్తి నగరంలోని కొంతమంది వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఫేస్ బుక్ లైవ్ లో కొందరి పై ఆరోపణలు చేశాడు.
ఈ సందర్భంగా ఆరోపణలు చేసిన చందును ఓ కుటుంబ వర్గానికి చెందిన వారు శారద సినిమా వద్ద కిడ్నాప్ చేసి అతడి కారులోనే తీసుకువెళ్లిపోయారు.
అలా కిడ్నాప్ చేసిన చందు ని అతడి కారులోనే ఉంచి అతడిపై అమానుషంగా కొందరు వ్యక్తులు చితకబాదారు.
అంతేకాదు, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ను కూడా ధ్వంసం చేశారు.ఆ తర్వాత చందు బట్టలు మొత్తం శరీరం పై తొలిగించి జోద్పూర్ నకా నుండి ఏకంగా గంట సమయం పాటు రోడ్డుమీద నగ్నంగా అతడిని రోడ్లపై తిప్పారు.
ఇక చివరికి ఆ వ్యక్తిని కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు.ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆ తర్వాత చందు సోదరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు చందు ను కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కార్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.