సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ రాంబో రణవీర్ సింగ్ కలిసి థమ్స్ అప్ యాడ్ లో నటించారు.అయితే ప్రస్తుతం ఈ అడ్వటైజ్మెంట్ భారత దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
చాలా విసువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించిన ఈ థమ్స్ అప్ యాడ్ లో మహేష్ బాబు, రణవీర్ సింగ్ సంభాషణ హైలైట్ అయ్యింది.థప్స్ అప్ కంపెనీ ఇచ్చిన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించిన వీళ్లిద్దరు కూడా చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా కనిపించారు.
ఈ అడ్వటైజ్మెంట్ లో పూర్తిగా ధ్వంసమైన నగరంలో మహేష్, రణవీర్ కనిపిస్తారు.రణవీర్ సింగ్ మాట్లాడుతూ.‘ప్రపంచంలో చివరగా మగాళ్లం మనమిద్దరమే ఉన్నామనుకుంటా.’ అని మహేష్ ని అడుగుతారు.
అయితే ‘ఇంకెవరైనా ఉంటే.అక్కడే ఉంటారు’ అని మహేష్ బాబు థమ్స్ అప్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ వైపు చూపిస్తారు.
ఆ వెంటనే వాళ్ళిద్దరూ కలిసి థమ్స్ అప్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్తారు.అప్పుడు రణవీర్ సింగ్ థమ్స్ అప్ తయారు చేయడం ప్రారంభిస్తారు.
అయితే ఆ ఫస్ట్ థమ్స్ అప్ బాటిల్ పట్టువడానికి మహేష్ బాబు, రణవీర్ సింగ్ లతో పాటు అక్కడే ఉన్న కొన్ని జోంబిస్ పరిగెత్తుకుంటూ వస్తాయి.అయితే మహేష్, రణవీర్ కలిసి జోంబిస్ లను ఎదుర్కొని థమ్స్ అప్ బాటిల్ దక్కించుకుంటారు.
‘సరిగ్గా చెప్పావు ఇప్పుడు కూడా మగాళ్లం మనిద్దరమే ఉన్నాం’ అని మహేష్ అంటారు.ఇది కూడా చివరి దేనా అని రణవీర్ అడగగా.చివరి థమ్స్ అప్, హా? అని మహేష్ అడిగి.అంటే ఏంటీ అని గడగడ థమ్స్ అప్ తాగేస్తారు.
దీంతో థమ్స్ అప్ యాడ్ పూర్తవుతుంది.
ఈ కంపెనీ అడ్వటైజ్మెంట్ ని మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా వేదికగా షేర్ చేశారు.
ఈ యాడ్ ని ఒక లక్షా 35 వేల మంది వీక్షించారు.పాతిక వేల మంది లైక్ చేశారు.650 మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.అయితే ఈ సాఫ్ట్ డ్రింక్ కోసం కలిసి నటించిన రణవీర్ సింగ్, మహేష్ బాబు ఒక యాక్షన్ మూవీ లో కూడా నటిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరి వెండితెరపై వీళ్ళిద్దరూ కలిసి యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తారు లేదా అనేది తెలియాల్సి ఉంది.