దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాల పాలన ఏరకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఇపుడు రాజకీయనాయకులకు వాళ్ళ స్వలాభాలు తప్పితే, ప్రజల గురించి పట్టడం లేదు.
ఎవరి సౌకర్యం వారు చూసుకుంటున్నారు.ఎన్నికలముందు తప్పితే, ప్రజలకు వారు ఇంకెప్పుడూ గుర్తుకు రానేరారు.
ఏ ప్రభుత్వ పాలనైనా ఎలావుంది అనేది తెలియాలంటే… ఆ రాష్ట్ర రోడ్ల పరిస్థితి చూస్తే అర్ధమైపోతుంది.తాజాగా అలాంటి పరిస్థితిని ప్రతిబింబించే ఘటన ఒకచోట చోటు చేసుకుంది.
వర్షాకాలం కారణంగా భారీ వర్షపాతం అన్నిచోట్లా నమోదవుతోంది.ముఖ్యంగా మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయి ప్రజలు కాలుతీసి బయటపెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి దాపురించింది.దాంతో ఓ ప్రాంతానికి చెందిన కొందరు స్థానికులు వినూత్న నిరసన చేపట్టారు.
రోడ్లపై నీటితో నిండిపోయిన గుంతల్లో కుర్చీలు వేసుకుని మద్యం సేవిస్తూ.సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
కాగా ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్గా మారింది.
వర్షాకాలానికి ముందే, రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, ప్రభుత్వాలపై ఉంది.అయితే ఒకవేళ రోడ్లు వేసినప్పటికీ నాసిరకం పనుల కారణంగా వర్షాకాలంలో రోడ్లన్నీ గుంతలతో నిండిపోతున్నాయి.దాంతో స్థానికంగా వున్న కొంతమంది గుమిగూడి ఆ గుంతల్లోనే కూర్చొని, మందుతాగుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి.
కాగా ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.నెటిజన్లు తీవ్రస్థాయిలో దీనిపై స్పందిస్తున్నారు.సదరు ప్రభుత్వాలను ఎండగడుతున్నారు.