భారత క్రికెట్ కు మన దేశంలో ఉన్న ఆదరణ ఎంతటిదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అన్ని దేశాల్లో క్రికెట్ ను ఆటగా మాత్రమే పరిగణిస్తారు.
కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూస్తారు.అంతలా క్రికెట్ ను వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారు అభిమానిస్తారు.
తాజాగా ఐపీఎల్ ప్రారంభమై చివరి అంకం ముగిసే సమయానికి ఓ జట్టు క్రికెటర్ లు కరోనా బారిన పడడంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేశారు.దీంతో అన్ని ఫ్రాంచైజీ క్రికెటర్ లు తమ ఇళ్లకు చేరుకున్నారు.
ఇక ఎటువంటి మ్యాచ్ లు లేకపోవడంతో అందరు క్రికెటర్ లు తమ కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు.
తాజాగా క్రికెటర్ జడేజా తన ఇంట్లో గుర్రంపై స్వారీ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.జడేజా అభిమానులు జడేజా గుర్రపు స్వారీ వీడియోపై తెగ కామెంట్స్ చేస్తున్నారు.
జడ్డూ.నువ్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో విడుదల చేసిన జడేజా నా రైడింగ్ స్కిల్స్ ను మరింతగా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నా అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ను జత చేశాడు.