ఆస్ట్రేలియా పై సరికొత్త చరిత్రను సృష్టించిన టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ అంజిక్య రహానే కు ముంబైలో ఘన స్వాగతం పలికింది.ఎన్నడూలేని విజయం సొంతం చేసుకోవడంతో పాటు బోర్డర్ – గవస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న కారణంగా అతనిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ తరుణంలో ముంబైలో అభిమానులు, స్థానికులు ఘనస్వాగతం పలుకుతా బాండ్ బాజాలతో సంబరాలు జరుపుకున్నారు.ముంబైలోని తన ఇంటికి తిరిగి వస్తున్న తరుణంలో స్థానికుల, రహానే అభిమానుల సంబరాలకు హద్దులు లేవు.
భారత్ విజయంతో దేశం గర్వపడేలాగా చేసిన కెప్టెన్ అపూర్వ స్వాగతం పలికి వారి అభిమానాన్ని వ్యక్తం చేశారు అభిమానులు.తన కూతురు ఆర్యను ఎత్తుకొని వస్తున్న తరుణంలో ఆయన అభిమానులు పూలవర్షం కురిపించి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో అతడి భార్య రాధిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియాలో రెగ్యులర్ కెప్టెన్ ఆయన విరాట్ కోహ్లీ లేకపోవడంతో టీమిండియాకు నాయకత్వం వహించిన రహానే ట్రోఫిని సొంతం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.ఇండియా జట్టులోని నలుగురు సభ్యులతో కలిసి రహానే ఆస్ట్రేలియా నుండి ముంబైకి చేరుకున్నాడు.
రహానే, రాధిక కు 2014లో లవ్ కమ్ ఆరేంజ్డ్ వివాహం చేసుకున్నాడు.ఇంతవరకు రహనే కెప్టెన్సీ వహించిన నాలుగు టెస్ట్ మ్యాచ్లో మూడు టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించగా, ఒక్క టెస్ట్ మ్యాచ్ లో మాత్రం డ్రాగా ముగించింది టీమ్ ఇండియా జట్టు.
.