ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.కొత్త కొత్త పరికరాలతో రోజు రోజుకి అనేక మార్పులు, అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచం ముందుకు కొనసాగుతుంది.
ఈ తరుణంలో డ్రోన్ల వినియోగం చాలా ఎక్కువ అయింది.మనలో చాలా మంది ఈ డ్రోన్ల వినియోగానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్లు లాంటి వాటిల్లో కూడా ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది.ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఒక క్రైస్తవ వివాహంలో డ్రోన్ ఉపయోగిస్తూ మంగళసూత్రాన్ని వరుడికి అందించే విధంగా వారు ఏర్పాటు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కర్కాల ప్రాంతంలో ఓ క్రైస్తవ పెళ్లి వివాహంలో డ్రోన్ ఉపయోగించి గాల్లో నుంచి మంగళసూత్రాన్ని తీసుకొనివచ్చి స్టేజ్ పై ఉన్న వరుడికి అందించే విధంగా డ్రోన్ ను ఏర్పాటు చేశారు.ఇలా ఆ వరుడుకి డ్రోన్ మంగళసూత్రం అందించగా ఆ వరుడు దాన్ని తీసుకొని వధువుకి తాళికట్టాడు.ఇలా డ్రోన్ స్టేజి మీదకు మంగళసూత్రాన్ని తీసుకొని వచ్చిన వీడియో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా పెళ్లికి వచ్చిన వారందరూ కూడా ఈ సంఘటనను చూసి అవాక్కయ్యారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.