పెళ్లికి ముందు ఫోటో షూట్ చేయించుకోవడం ఇప్పుడిదొక కొత్త ట్రెండ్.యువ జంట తమ ప్రేమని పెళ్లికి ముందే ఫోటోల్లో పదిలంగా దాచుకునే ఈ కొత్త పోకడ పెద్ద పెద్ద సిటీలను దాటి మామూలు నగరాల్లోకి ప్రవేశించింది.
ఒకప్పుడు సెలబ్రిటీ జంటలే ఇలా ఫోటోలకు ఫోజులిచ్చి మురిసిపోయేవి.ఇప్పుడు అలాంటి ధనిక, పేద హద్దులు ల్లేవు.
పదివేలు ఖర్చుపెట్టగలిగే స్థోమత ఉంటే చాలు ఫోటోగ్రాఫర్లు వెంట వచ్చి మరీ, నచ్చినట్టుగా నచ్చినట్టుగా ఫోటోలు తీస్తున్నారు.అయితే పెళ్లికి ముందు తీసుకునే ఫోటోలు ప్రత్యేకంగా ఉండాలి.
ఆ ఫోటోల్లోనే వారి ప్రేమ, ఒకరంటే ఒకరికి ఉండే అనురాగం తెలిసిపోవాలి.అలాంటి రొమాంటిక్ టచ్ ఫోటోలకు ఇస్తే అవి పర్సనల్ ఆల్బమ్ లో అదిరిపోతాయి.
అందుకోసమే చాలా మంది తమ పెళ్లికి ముందు ఫోటో షూట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.అయితే తాజాగా ఓ జంట ఫోటె షూట్ ను కాస్త వెరైటీగా చేయించుకుంది.
అయితే వారి ప్రయత్నం తలకిందులయ్యింది.
దీంతో ఫోటో షూట్ కాస్తా గందరగోళంగా మారిపోయింది.
ప్రస్తుతం వారికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.వీడియోను చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.
వీడియోలో బంధువులు, స్నేహితులతో కలిసి నవ దంపతులు సరదాగా ఫోటోలు తీసుకుంటున్నారు.వీరి పెళ్లి ఫోటోలు మరింత ప్రత్యేకంగా ఉండాలనే ఆశతో నది ఒడ్డున చెక్కతో తయారు చేసిన వంతెనపై ఫోటో షూట్ పెట్టుకున్నారు.
వధూవరులతో పాటు మరికొంతమంది వంతనెపై ఫోటోకు ఫోజులిస్తూ నిలబడ్డారు.పాపం ఇంతలోనే ఆ వంతెన కాస్తా విరిగిపోయింది.
దీంతో వారంతా నీళ్లలో పడిపోయారు.నది లోతు ఎక్కువగా లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
అందరూ సురక్షితంగా బయటపడ్డారు.కానీ ఆకస్మాత్తుగా జరిగిన ఆ ఘటనతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి.
ఇదంతా అక్కడే ఉన్న కెమెరామెన్ వీడియో తీశారు.అనంతరం ఆ వీడియోను నెట్లో షేర్ చేయటంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది.