వెల్లువలా వస్తున్న కరోనా రోగులకు సరిపడినంత వైద్య చికిత్సలను అందించలేమని, వారి చికిత్సకు అవసరమయ్యే మౌలిక వసతులు తమ వద్ద లేవని న్యూఢిల్లీతో పాటు, నేషనల్ కాపిటల్ రీజియన్ లోని ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి.వచ్చిన రోగులతో పాటు, ఆసుపత్రుల్లో ఉన్న వారిని కూడా వెళ్లిపోవాలని వైద్యులు కోరుతున్నారు.
దేశ రాజధానిలో ప్రముఖ ఆసుపత్రులైన అపోలో, ఫోర్టిస్, మ్యాక్స్, సర్ గంగారామ్ వంటి ఆసుపత్రులన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొని ఉండటం.అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
చిన్న ఆసుపత్రుల్లో సైతం ఇదే విధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, కరోనా పేషంట్లు వస్తుంటే, తీవ్ర లక్షణాలు ఉన్న వారిని కూడా చేర్చుకునే పరిస్థితులు కనిపించడం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.చాలా ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేక కొత్త అడ్మిషన్లను తీసుకోలేకపోతున్నామని, ఎంతో మంది ఇన్ పేషంట్లుగా చేరడానికి ఆంబులెన్స్ ల్లోనే వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
ఓ వైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే మరోవైపు రకరకాల వీడియోలు నేటింట్లో వైరల్ అవుతున్నాయి.ఇటువంటి టైంలో ఓ వీడియో నెటిజన్లను బాగా నవ్విస్తోంది.
అందులో ఓ కరోనా పేషెంట్ తన బెడ్ కి పైన సీలింగ్ కి వేలాడుతున్న ఫ్యాన్ ని మార్చమని ఆస్పత్రి అధికారులను వేడుకున్నాడు.మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వీడియోలో ఆధారంగా కరోనా సోకిన కుర్రాడు ఆస్పత్రి వార్డులో ఓ బెడ్పై ఉన్నాడు.ఆ వార్డులో చాలా మంది పేషెంట్లు ఉన్నారు.అతను తన మొబైల్ తో సెల్ఫీ వీడియో తీశాడు.తనపైన ఉన్న ఫ్యాన్ ని అందులో చూపించాడు.
ఆ ఫ్యాన్ గుండ్రంగా తిరుగుతూనే ఉంది.ఊడి మీద పడుతుందేమో అన్నట్లుగా తిరుగుతోంది.
అదే అతన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.అతను ఆ వీడియోలో “మిత్రులారా నేను చింద్వారాలో అతి పెద్ద ఆస్పత్రిలో చేరాను.కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి” అని అతను వీడియోని చూపించాడు.“నా బెడ్ కి పైన ఓ విదేశీ ఫ్యాన్ తిరుగుతోంది.దాన్ని చూస్తుంటే భయం వేస్తోంది.కరోనా వల్ల భయం లేదు.ఈ ఫ్యాన్ భయపెడుతోంది” అని చెప్పాడు.“కరోనా కంటే ముందు ఈ ఫ్యానే నన్ను చంపేసేలా ఉంది” అని ఆ పేషెంట్ అన్నాడంటే.అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అంచనా వేసుకోవచ్చు.అతను త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు.ఫ్యాన్ మార్చేలోపే నువ్వు రికవరీ అవ్వాలని ఓ వ్యక్తి కోరారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.