ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమంది కరోనా బాధితులు ఆక్సిజన్ అందక, బెడ్స్ కొరతతో ఇలా పలు ఇబ్బందులు కారణంతో మృత్యువాత పడుతున్నారు.
తాజాగా తాగేందుకు నీరు లేవన్న కారణంతో ఒక కరోనా రోగి మృతి చెందిన దారుణ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ జిల్లా సుశీలా తివారీ ఆస్పత్రిలో సదరు కరోనా రోగికి చికిత్స అందజేస్తున్నారు.ఈ క్రమంలో తాగే నీరు అందుబాటులో లేదని బాగా దాహం ఉంది అంటూ ఆ కరోనా రోగి వేడుకోవడం మనం వీడియోలో గమనించవచ్చు.వెంటనే నీళ్లు పంపాలని ప్రాధేయపడినా ఎంత మాత్రం ఆసుపత్రి వర్గాలు నీరు అందకపోవడంతో ఆ మహిళ తాజాగా మృతి చెందారు.
ఈ క్రమంలో సదరు మహిళ “నేను సుశీలా తివారీ ఆస్పత్రిలోని కొవిడ్ కేర్ వార్డ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను.గత రాత్రి నుంచి ఇక్కడ మంచినీరు లేదు.
వీలైనంత త్వరగా మాకు నీరు సమకూర్చండి ప్లీజ్.నాతోపాటు ఇక్కడ చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.” అంటూ చెప్పుకొచ్చారు.
ఈ సంఘటనలో భాగంగా సుశీలా తివారీ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఆ మహిళ చనిపోయిందని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
కానీ అధికారులు మాత్రం దాన్ని ఖండిస్తూ ఒక్కొక్క కరోనా రోగికి నాలుగు బాటిళ్ల నీటిని అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు.అయితే ఆ మహిళ ఆరోగ్యం విషమించడం వల్లనే మృతి చెందిందనిహాస్పిటల్ సిబ్బంది వారు పేర్కొన్నారు.
ఏది ఏమైనా ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ శృతి మించడంతో చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరినీ కలిచివేస్తోంది.