ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం ప్రకటచినప్పుడు బయటకు కనిపించని విశాదకర ఘటనలు చాలా చోటుచేసుకుంటాయి.అవి అసలు బయటికి రావడం అనేది చాలా అరుదు.
దేశాధినేతలు విసురుకున్న సవాళ్లు, పెను సవాళ్లకు దేశ పౌరులు బలవుతుంటారు.ఎంతో మంది విగతజీవులుగా మారుతుంటారు.
ఆర్థికంగా చితికిపోయి కొన్నేళ్ల క్రిందికి వెళ్ళిపోతారు.చిన్నారులు కాల్పులలో చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోతుంటారు.
ఇది చదవడానికి ఎంతో విషాదకరంగా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది.అక్కడ జరుగుతున్న పరిస్థితులను మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఇజ్రాయిల్ లో ఉన్న పరిస్థితులపై మాట్లాడిన మాటలు ఒక్క సారిగా నెటిజన్ లను కన్నీటి పర్యంతం చేశాయని చెప్పవచ్చు.మా దేశంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, నాకు డాక్టర్ కావాలని ఉందని, ఒక వేల డాక్టర్ అయుంటే ఇక్కడ ఎవ్వరి ప్రాణాలు పోకుండా కాపాడేదాన్ని, నా ప్రజల గురించి ఏమైనా చేయాలని ఉంది అని ఆ చిన్నారి చెబుతున్న మాటలు చాలా నిశ్శబ్ద గంభీరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ చిన్నారి మాట్లాడిన వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.నెటిజన్లను కన్నీటి పర్యంతం చేస్తున్న ఈ వీడియోను కామెంట్స్, షేర్ లతో మరింత వైరల్ గా మార్చుతున్నారు.