మరికొన్ని క్షణాల్లో మూడు ముళ్ళు పడిపోతే ఒక వ్యక్తికి భార్య అయిపోతున్న సమయంలో పెళ్లి కూతురు పెళ్లికి నో చెప్పేసింది.అచ్చం సినిమాల్లో జరిగే సీన్ లాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటూ నా ప్రియుడు ఇంకో అరగంటలో వచ్చి తనను తీసుకెళ్తాడు అంటూ అందరి ముందు చెప్పింది పెళ్లి కూతురు.
ఈ మాటతో ఆ పెళ్లి కొడుకుకి మైండ్ బ్లాక్ అవ్వగా పెళ్ళికి వచ్చినవాళ్ళు ఇదేం వ్యవహారం అబ్బ అంటూ ముక్కున వేలు వేసుకున్నారు.అంతేకాదు ఓ పెద్దావిడ పరువు తీశావు అంటూ బంధువులు ఉండగానే పెళ్లి కూతురును చెంపలు వాయించింది.
ఆయన కాని ఆ పెళ్ళికూతురు దేనికి అస్సలు తగ్గలేదు.కేవలం అరగంటలో తన ప్రేమికుడు వచ్చి తీసుకువెళ్తాడు అని చెప్పుకొచ్చింది.
అంతేకాదు మీకంటే అతడే తనకు ముఖ్యం అని తేల్చి చెప్పేసింది.ఇకపోతే ఆ పెళ్ళికూతురు అడిగిన అరగంట గడిచింది అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్న పూర్తి వివరాల్లోకి వెళితే.
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా ఉదగ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ప్రియదర్శిని అనే యువతికి అలాగే ఆనంద్ అనే యువకుడికి పెళ్లి చేయడానికి పెద్దలు అందరూ సిద్ధమయ్యారు.
అంతేకాదు ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరూ పెళ్లి పీటల పై కూర్చున్న తర్వాత పెళ్లి కూతురు ప్రియదర్శిని తాళిని కట్టకు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ పైకి లేచింది.దీంతో ఆవిడ పెద్దలు చెప్పిన మాట వినకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది.
దీంతో ఆ పెళ్లి కొడుకు అక్కడి నుంచి తనకి ఈ పెళ్లి వద్దు అంటూ వెళ్లిపోయాడు.
పెళ్లి కూతురు అడిగిన అరగంట తర్వాత మరి కొంత సమయం వేచి చూసినా కూడా ఆమె ప్రియుడు అక్కడికి రాలేకపోయాడు.
దీంతో ఆ పెళ్లికూతురు ముఖం చెల్లలేదు.ఇక అంతే ఆ పెళ్ళికి వచ్చిన బంధువులు అందరూ ఆ పెళ్లికూతురిని తిట్ల పురాణం అందుకున్నారు.
అయితే ఇది వరకు పెళ్లికూతురు ప్రియదర్శిని పార్తిబన్ అనే యువకుడిని ప్రేమించింది.అయితే అందుకు ఇంటి పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెద్దల సమక్షంలో అరేంజ్ పెళ్లికి ఒప్పుకున్నట్లు ఆవిడ తెలిపింది.