ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ నలుమూలల ఏ విషయమైనా సరే నిమిషాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.దీంతో కొన్ని సార్లు నెటిజన్స్ పోస్ట్ చేసే ఫోటోలు కానీ, వీడియోలు కానీ తెగ వైరల్ గా మారడం చూస్తూనే ఉన్నాం.
అందులో ముఖ్యంగా పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో సూపర్ వైరల్ గా మారాయి కూడా.తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ ఎలుగుబంటి చెట్టు ఎక్కి మరీ పాట పాడుతోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
అసలు ఎలుగుబంటి ఏంటి.? ఎలుగుబంటి ఎక్కడైనా పాటలు పాడుతుందా.? అందులోనూ చెట్టు ఎక్కి మరి పాట పాడుతుంది అని అనుకుంటున్నారు కదా.! అవునండి.మీరు విన్నది అక్షరాలా నిజమే.ఓ మధ్య వయస్సు గల ఎలుగుబంటి ఏకంగా ఓ చెట్టు ఎక్కి మరి తన గాత్రంతో మిగతా జంతువులకు తన పాటను వినిపిస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ సంఘటన అమెరికాలోని యోస్ మైట్ అనే జాతీయ పార్కు లో జరిగింది.
ఆ పార్కులో ఏకంగా 300కు పైగా ఎలుగుబంట్లు నివసిస్తున్నాయి.అందులోని ఓ ఎలుగుబంటి తాజాగా చకచక చెట్టు ఎక్కేసి పాట పాడటం మొదలు పెట్టింది.
దాదాపు ఒక నిమిషం పాటు ఆ ఎలుగుబంటి పాట పాడుతూ ఎంజాయ్ చేసింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఎలుగుబంటి పాడిన పాట విని నచ్చినట్లయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి.