ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ దాగి ఉందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.అయితే కొందరిలో మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉండేలా వారి ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెబుతారు.
వారు చేసే పనులు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు.ఇలాంటి వారు మన చుట్టుపక్కల ఎందరో కొందరు ఉండనే ఉంటారు.
అయితే ఇది వరకు కాలంలో ట్యాలెంట్ ను బయట పెట్టుకోవడానికి చాలా సమయం పట్టేది.అయితే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా ఎవరి ట్యాలెంట్ ని వారు అతి తక్కువ సమయంలో ప్రపంచానికి చాటి చెప్పేస్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.
తాజాగా ఓ నెయిల్ ఆర్టిస్ట్ సంబంధించి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దుబాయ్ దేశానికి చెందిన ఓ మెయిల్ ఆర్టిస్ట్ తన గోరుపై ఓ చిన్న సైజు ఆక్వేరియం రూపొందించాడు.అంతేకాదండోయ్.ఆ ఆధ్వర్యంలో చిన్న బతికి ఉన్న చేప పిల్లలను కూడా వేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.చేతి గోరు పై ఆ చేపను వేసినప్పుడు ఆ చేప ఆ సమయంలో కలిగి ఉండడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.
ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున ఆ మెయిల్ ఆర్టిస్ట్ పై కామెంట్ల వర్షం కురుస్తోంది.
కొంతమంది ఆర్టిస్ట్ గొప్పతనాన్ని మెచ్చుకుంటే.మరికొందరు గోరుపై చేపని పెట్టడంతో అతను చేపను హింసిస్తున్నాడని మరో రకంగా కామెంట్ చేస్తున్నారు.అయితే వీడియోలో చేపను చాలా తక్కువ సమయం గోరు పై ఉంచి వెంటనే ఆ చేపను తిరిగి నీటిలో వదిలేశాడు.
అలా నీటిలో వదలన చేప సురక్షితంగానే ఉంది.అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సమయంలో తాను ఏ చేపను హింసించడం లేదంటూ క్యాప్షన్ ను కూడా జత చేశాడు.