సోషల్ మీడియా అనేది ఓ అద్బుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి.
జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా అందులో ప్రత్యక్షమవుతుంటాయి.చాలా చోట్ల జంతువులు చేసే అల్లరి, తమాషా పనులు, విచిత్ర పనులు.
ఇలా అనేక రకాలైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పర్యాటకులు అనేక ప్రాంతాలకు వెళ్లుతుంటారు.అలా వెళ్లిన వారు తాము చేసే పనులు, చూసిన విషయాలను నెట్టింట పోస్టు చేస్తుంటారు.
తాజాగా అలాంటి ఓ జంతువు గురించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.ఓ ఎలుగుబంటి చేసిన తమాషాను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ సర్క్యులేట్ అవుతోంది.బెంగాల్ ప్రాంతంలోని సిలిగురి సఫారీలో పర్యాటకులు ఈ వీడియోను తీశారు.
ఆ ప్రాంతంలో హిమాలయన్ నల్ల ఎలుగుబంటి ఉంది.
ఆ ప్రాంతంలో అధిక వేడి, ఎండకు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి.
ఆ సిలిగురిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎండకు తట్టుకోలేని హిమాలయన్ ఎలుగుబంటి చాలా ఇబ్బందులు పడింది.అక్కడే ఉన్నటువంటి ఓ కొలనులోకి ఆ ఎలుగుబంటి దూకేసింది.
అయితే ఎండ ఎక్కువగా ఉండటం వలన ఎలుగుబంటికి కాస్త ఉపశమనం కలిగించేందుకు సఫారీ సిబ్బంది ఓ కొలను ఏర్పాటు చేసి అందులో ఐసు గడ్డలను పెట్టారు.
పెద్ద పెద్ద ఐస్ గడ్డలు ఉండటం వలన అక్కడికి వచ్చిన ఎలుగుబంటి ఆ కొలనులోకి దూకి కాస్త సేద తీరి ఉపశమనం పొందింది.అంతేకాకుండా ఐస్ గడ్డను తన ఎదపై పెట్టుకుని దాన్ని కొరుకుతూ, తన శరీరంపై రుద్దుకుంటూ దానితో ఓ ఆట ఆడుకుంది.ఎలుగుబంటి ఇలా ఐస్ గడ్డతో ఆట్లాడుకోవడం చూసి పర్యాటకులు వీడియోలు తీశారు.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి హల్ చల్ చేస్తోంది.