అవును, ఎన్నో జానపద కళలు( Folk arts ) కాలగర్భంలో కలిసిపోయాయి.మరెంతో మంది కళాకారులు సరైన గుర్తింపు లేక, ఆఖరికి కతికపేదరికంలో నేలకొరిగారు.
కళకే అంకితం అయిన వారు తమ కళను భిక్షాటనకు ఉపయోగించడం నేటి సమాజంలో మనసుని కలచివేస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా రోడ్డుపై ‘సారంగి’ వాయిస్తున్న ఓ కళాకారుడి వీడియో సోషల్ మీడియాలో అవుతోంది.
భారతదేశంలో( India ) ఎంతోమంది జానపద కళకారులు ఉన్నప్పటికీ వారికి ఆయా రాష్ట్రాల నుంచి సరైన ప్రోత్సాహం లేక నానా అవస్థలు పడుతున్నారు.చాలామంది గాయకులు, నృత్యకారులు వేదికలపై ప్రదర్శనలు ఇవ్వవలసి వస్తోంది.
జీవనోపాధి లేని పక్షంలో ఆఖరికి భిక్షాటన చేయాల్సిన పరిస్థితి.
ఇక తాజాగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకురాలు అశ్వినీ భిడే దేశ్ ( Ashwini Bhide Desh )తీసిన వీడియో వారి పరిస్థితులకు అద్దం పడుతోందని చెప్పుకోవచ్చు.ఈ వీడియోలో ఓ సంగీత కారుడు రోడ్డుపై సారంగి వాయిస్తూ కనిపించడం మనం గమనించవచ్చు.వీడియో రికార్డింగ్ సమయంలో అశ్వినీ భిడే సారంగికి శ్రావ్యమైన రాగాలను పాడారు.అమిత్ ఆనంద్ బివాల్కర్( Amit Anand Biwalkar ) అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేయగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.‘ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అశ్వినీ భిడే తీసిన వీడియో.సారంగికి తన శ్రావ్యమైన గళాన్ని అందించారు.ఈ వీడియోను మీరందరూ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి’ అనే శీర్షికతో ఈ వీడియోని షేర్ చేశారు.
కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు అనేకమంది మిక్కిలి ఆవేదన చెందుతున్నారు.దేశంలో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఇలాంటి దుస్థితిని ఎదుర్కుంటున్నారని వారు కామెంట్ల రూపంలో బాధపడుతున్నారు.ఆ కళాకారుడికి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే అతని కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని చాలామంది ఇక్కడ తమ కామెంట్ల రూపంలో అభిప్రాయపడ్డారు.మీరు కూడా ఆ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి.