తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.చాలా మంది సినిమాలలో బ్రహ్మానందం చేసే కామెడీకి ఇట్లే నవ్వేస్తారు.
ఇందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఆయన తెరపై చేసే సన్నివేశాలు, ఆయన కామెడీ సీన్ల టైమింగ్ లో తన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు.
ఇక అలాగే మిమ్స్ వరల్డ్ లో బ్రహ్మానందం ఒక లివింగ్ లెజండ్ అని పిలుస్తూ ఉంటారు.ఆయన ఎక్స్ ప్రెషన్స్ తోనే రొటీన్ మెమ్స్ కూడా నెటిజెన్స్ ను బాగా నవ్వు తెప్పిస్తుంది.
బ్రహ్మానందానికి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎందరో ఉన్నారు.అదే విధంగా బ్రహ్మానందం మీమ్సీ, టెంప్లెట్స్కి చాలా క్రేజ్ ఉంది.
ఇందుకు నిదర్శనంగా తాజాగా సిడ్నీ టెస్ట్ సందర్భంగా ఒక ఆస్ట్రేలియా జర్నలిస్ట్ బ్రహ్మానందం పిక్ ను షేర్ చేయడమే ఇందుకు నిదర్శనం.
“సిడ్నీలో మళ్లీ వర్షం వస్తుంది ఇప్పటికే ఒక సెట్ వర్షం కారణంగా కోల్పోయాం.ఆటకు వర్షం అడ్డంకి కలిగింది అని చెప్పి వాతావరణ రిపోర్టు చెప్పిన స్నేహితుడి వైపు నేను ఇలా చూస్తున్నా.” అంటూ బ్రహ్మానందం ఫన్నీ ఎమోషన్ పిక్ ను జత చేసారు పోస్టులో.ఫన్నీగా పోస్ట్ లు చేసే అమాండా, బ్రహ్మానందం ఫోటోలను ఉపయోగించడంతో తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆమె చేసిన పోస్ట్ కు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.అలాగే ఈ పోస్ట్ కు మంచి స్పందన రావడం కూడా విశేషం.
ప్రస్తుతం జరుగుతున్న 3వ సిడ్నీ టెస్టు లో భాగంగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆల్ అవుట్ కాగా… టీమిండియా 244 పరుగులకే ఆలౌట్ అయ్యింది.దీంతో ఆస్ట్రేలియాకు మొదటి ఇన్నింగ్స్ లో 94 పరుగుల ఆధిక్యం లభించింది.ప్రస్తుత సమాచారం మేరకు ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 97 పరుగులతో ఆడుతోంది.